Latest

Loading...

Andhra Pradesh: ఏపీ సర్కారు సంచలన నిర్ణయం.. 259 స్కూళ్ల గుర్తింపు రద్దు.. వివరాలివే


నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పాఠశాలలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝులిపించింది. ఏకంగా 259 స్కూళ్ల గుర్తింపును రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్. గవర్నమెంట్ ఎగ్జామ్స్ డైరెక్టర్ సుబ్బారెడ్డి ఈ మేరకు వివరాలను వెల్లడించారు. ఆయా పాఠశాలలకు 2019-20 విద్యా సంవత్సరంలోనే గుర్తింపు గడువు ముగిసిందని తెలిపారు. ఈ పాఠశాలలు తమ గుర్తింపును రెన్యువల్ చేసుకోలేదన్నారు. ఈ స్కూళ్లను వసతుల కల్పనపై అనేక సార్లు హెచ్చరించినప్పటికీ మార్పు రాలేదని తెలిపారు. దీంతో 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఆ స్కూళ్ల గుర్తింపును నిలిపివేసినట్లు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆయా పాఠశాలల ఆన్‌లైన్ నామినల్ రోల్స్‌ను స్వీకరించబోమని స్పష్టం చేశారు.బ్లాక్ లిస్ట్ లో పెట్టిన స్కూల్స్ వివరాలను చూడడం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయిండి.

ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల కీలక ప్రకటన చేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా సీఎం మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థలల్లో రానున్న విద్యా సంవత్సరం 2021-22 నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు సీబీఎస్‌ఈ (సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌) విద్యా విధానాన్ని ప్రారంభించున్నట్లు వెల్లడించారు. ఆ తరువాత తరగతులకు వరుసగా ఒక్కో ఏడాది పెంచుకుంటూ సీబీఎస్సీ విద్యా విధానాన్ని వర్తింప చేస్తామని వివరించారు. 12వ తరగతి వరకు సీబీఎస్‌ఈ విధానాన్ని దశలవారీగా అమలు చేయనున్నట్లు చెప్పారు.

ఇందుకు సంబంధించి ఎఫిలియేషన్‌ కోసం సీబీఎస్‌ఈ బోర్డుతో చర్చించి, ఒప్పందం కుదుర్చుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. కామన్‌ సిలబస్‌ వల్ల జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధం కావడం సులభంగా ఉంటుందని ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యల ద్వారా విద్యార్థులు ఆంగ్లంపై మరింత పట్టు సాధిస్తారన్నారు. తద్వారా మన విద్యార్థులు ఎక్కడైనా రాణించే అవకాశం ఉంటుందని సీఎం అన్నారు.

 

No comments

Powered by Blogger.