AP news: ప్రాథమిక పాఠశాలల్లో అంగన్వాడీల విలీనం
రాష్ట్రంలోని 34 ప్రాథమిక పాఠశాలలను ఫౌండేషన్ స్కూల్స్గా మార్చాలని ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. విద్యాశాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మధ్య సమన్వయంపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఒకటో తరగతి నుంచి ఐదోతరగతి వరకు ఉన్న పాఠశాలల్లో అంగన్వాడీలను విలీనం చేయాలని తెలిపారు. నాణ్యమైన విద్యతోపాటు విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రీప్రైమరీ పాఠశాలలు పిల్లలకు దగ్గరగా ఉండాలన్నారు. పాఠశాలలన్నీ 3 కి.మీ దూరంలో అందుబాటులో ఉండాలని చెప్పారు. టీచర్ల బోధన సామర్థ్యానికి తగినట్లుగా హేతుబద్ధీకరణ చేపట్టాలన్నారు. ఫౌండేషన్ స్కూళ్ల తర్వాత డిజిటల్ బోధనపై దృష్టి పెట్టాలన్నారు.
No comments