APలో రేపటి నుంచి పగటి కర్ఫ్యూ ..!
ఏపీలో రేపటి నుంచి పగటి కర్ఫ్యూ అమల్లోకి రాబోతోంది. ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే దుకాణాలకు అనుమతి ఇస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి మళ్లీ తెల్లారేంత వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఇదే సమయంలో 144 సెక్షన్ కూడా అమల్లో ఉంటుందని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఉదయం ఆరు నుంచి 12 గంటల వరకు దుకాణాలు తెరిచి ఉంచిన సమయంలోనూ 144 సెక్షన్ను అమలు చేయనున్నారు. అంటే, ఐదుగురికి మించి గుమిగూడడానికి వీల్లేదు. ఏపీలో ఇప్పటికే రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమలవుతోంది. రేపటి నుంచి అమల్లోకి రానున్న ఈ నిబంధనలను రెండు వారాల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. అయితే, మధ్యాహ్నం 12 గంటల తరువాత అత్యవసర సేవలకు అనుమతి ఇస్తామని ప్రభుత్వం తెలిపింది.
ఏపీలో రేపటి నుంచి పగటి కర్ఫ్యూ అమల్లోకి రాబోతోంది. ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే దుకాణాలకు అనుమతి ఇస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి మళ్లీ తెల్లారేంత వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఇదే సమయంలో 144 సెక్షన్ కూడా అమల్లో ఉంటుందని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఉదయం ఆరు నుంచి 12 గంటల వరకు దుకాణాలు తెరిచి ఉంచిన సమయంలోనూ 144 సెక్షన్ను అమలు చేయనున్నారు. అంటే, ఐదుగురికి మించి గుమిగూడడానికి వీల్లేదు. ఏపీలో ఇప్పటికే రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమలవుతోంది. రేపటి నుంచి అమల్లోకి రానున్న ఈ నిబంధనలను రెండు వారాల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. అయితే, మధ్యాహ్నం 12 గంటల తరువాత అత్యవసర సేవలకు అనుమతి ఇస్తామని ప్రభుత్వం తెలిపింది.
No comments