Blood clots with covid : కోవిడ్ వల్ల రక్తం గడ్డ కట్టిందని ఎలా గుర్తించాలో తెలుసా..?
కొన్ని అధ్యయనాల ప్రకారం, ఇప్పటికే గుండె జబ్బులు లేదా మధుమేహం ఉన్నవారిలో 15-20 శాతం మందికి మాత్రమే సమస్యలు ఉన్నాయి. వారిలో 5% మందికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. కానీ, గుండె జబ్బులు లేవని లేదా లక్షణాలు లేనప్పుడు దాని గురించి తెలియక నిర్లక్ష్యం వహిస్తున్న యువతకు చాలా హాని జరుగుతోంది. అయితే నిపుణులు చెబుతున్న దాని ప్రకారం చాలా మంది యువతలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ధమనుల్లో రక్తం గడ్డ కట్టడం కారణంగా ఒక్కోసారి అవయవాలనే తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
.
రక్తం గడ్డ కట్టడానికి కారణాలు నిజంగా ఇదే కారణం అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. కరోనా సోకడంతో రక్తం చిక్కగా మారుతుంది. అది ఎక్కువై రక్తం గడ్డ కట్టే పరిస్థితులకి దారి తీస్తుంది. లేదు. చాలా మటుకు కోవిడ్ నుండి రికవరీ అయ్యాక 2-3వారాల్లో కూడా ఇలాంటి సంఘటనలు ఏర్పడుతున్నాయి. అందువల్ల లక్షణాలని తొందరగా పసిగట్టలేక వైద్యం ఆలస్యం అయిపోయి ప్రాణాలకి ప్రమాదంగా మారుతుంది.
మొదటగా అవయవాల్లో విపరీతంగా నొప్పి కలుగుతుంది. చేతి వేళ్ళు, కాలి వేళ్ళు తిమ్మిర్లు ఏర్పడతాయి. మూడవ లక్షణంలో అవయవాలు పనిచేయడం ఆగిపోతాయి. అంటే పక్షవాతంలా అని చెప్పవచ్చు. రక్తం సరిగ్గా సరఫరా అవదు కాబట్టి పాలిపోయినట్టు కనిపిస్తారు. మొదట లక్షణాలు కనిపించిన 6-8గంటల్లో వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవడం ఉత్తమం. ఆలస్యం అవుతుంటే అనేక ప్రమాదాలు కలిగే అవకాశం ఉంది.
No comments