Biryani Cancer : బిర్యానీ తింటున్నారా? అయితే జాగ్రత్త.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం..!!
Biryani Cancer : బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఉండరు. చాలామంది బిర్యానీ ప్రియులు ఉన్నారు. ఏదైనా అకేషన్ వచ్చినా, దావత్ అన్నా కచ్చితంగా బిర్యానీ ఉండాల్సిందే. అయితే బిర్యానీ ప్రియులకు ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. బిర్యానీ తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బిర్యానీకి, క్యాన్సర్ కి లింక్ ఏంటి? అనే సందేహం వచ్చింది కదూ..
మ్యాటర్ ఏంటంటే… మార్కెట్ లో కల్తీ పెరిగిపోయింది. కాదేదీ అనర్హం అన్నట్టు అన్నీ కల్తీ చేసి పాడేస్తున్నారు. కొందరు కేటుగాళ్లు ఆహార పదార్థాల తయారీలో అక్రమాలకు పాల్పడి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. ఇటీవల కాలంలో కొన్ని ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, హోటళ్లు, రెస్టారెంట్లు మరీ బరి తెగించాయి.
ఆహారం మంచి రంగులో కనిపించేందుకు ప్రజారోగ్యాన్ని పక్కన పెట్టి వంటల తయారీలో విచ్చలవిడిగా ఎసెన్సులు, ఇతర రంగులను వాడుతున్నారు. హోటళ్లు, సూపర్ మార్కెట్లు, బేకరీల్లో ఆహార పదార్థాల కల్తీ నియంత్రణ అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో విచ్చలవిడి రంగుల వాడకం బయట పడింది.
ఈ క్రమంలో బయటి నుంచి తెచ్చుకునే బిర్యానీతో ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉందనే నిజం వెలుగుచూసింది. బిర్యానీ అంటే ఇష్టపడే వారికి ఆ ఫుడ్ లోని రంగులు చూసి అట్రాక్ట్ అవుతుంటారు. అయితే ఈ ఫుడ్ కలర్స్ వెనుక అసలు విషయం తెలిస్తే షాక్ కొట్టక మానదు. అలాంటి రంగు వచ్చేందుకు విచ్చలవిడిగా సింథటిక్ కలర్స్ వాడేస్తున్నారు. ఇలాంటి కలర్స్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ వంటి నగరాలతో పాటు అనేక పట్టణాల్లో దొరికే బిర్యానీ ఆకర్షణీయంగా ఉండేలా ఈ రంగులు వాడేస్తున్నారని అధికారుల తనిఖీల్లో బయటపడింది.
చికెన్, మటన్, బిర్యానీ, బేకరీలు, స్వీట్స్ తయారీల్లోనూ ఎసెన్స్, సింథటిక్ రంగులు అధికంగా వేస్తుండటంతో క్యాన్సర్ వంటి వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు హోటల్స్లో చికెన్, మటన్, రొయ్యలు ఎక్కువ రోజులు డీప్ ఫ్రిజ్లో ఉంచి వాడుతున్నారు. ఇలాంటి నిల్వ మాసం తింటే అజీర్తి సమస్యలు, ముఖ్యమైన అవయవాలు పనిచేయకపోవటం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. సో, బయటి ఫుడ్ తో తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు.
No comments