Latest

Loading...

Good news ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్...డబుల్ బొనాంజా....


 కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు తీపికబురు అందించింది. డియర్‌నెస్ అవెన్స్ DA (డీఏ) పెంపునకు ఆమోదంతో ఉద్యోగులకు ఇప్పటికే తీపికబురు అందించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మరో శుభవార్త అందించింది. అదిరిపోయే బొనాంజా తీసుకువచ్చింది. కీలక నిర్ణయం తీసుకుంది. వెలువడుతున్న నివేదికలను గమనిస్తే.. మోదీ సర్కార్ ఉద్యోగులకు హౌస్ రెంట్ అలవెన్స్ HRA పెంచినట్లు తెలుస్తోంది. దీంతో ఉద్యోగులకు వచ్చే నెల నుంచి హెచ్ఆర్ఏ పెరుగుతుంది. డియర్‌నెస్ అలవెన్స్ 25 శాతానికి పైగా చేరడం వల్ల హెచ్‌ఆర్ఏ కూడా పెరుగుతుంది. ఇకపోతే ఉద్యోగులు నివసించే పట్టణం ప్రాతిపదికన వారికి హెచ్ఆర్ఏ పెంపు అమలవుతుంది. ఎక్స్ కేటగిరికి 27 శాతం పుంపు ఉంటే.. వై కేటగిరికి పెంపు 18 శాతంగా, జెడ్ కేటగిరికి పెంపు 9 శాతంగా ఉంటుంది.

50 లక్షలకు పైన జనాభా ఉన్న ప్రాంతాలను ఎక్స్ కేటగిరి కింద, 5 లక్షలకు పైన జనాభా ఉంటే వై కేటగిరి కింద, 5 లక్షలకు లోపు జనాభా ఉంటే జెడ్ కేటగిరి కింద చేర్చుతారు. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే ఉద్యోగులకు డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. డీఏ 11 శాతం పెరిగింది. దీంతో ఉద్యోగులకు డీఏ 17 శాతం నుంచి 28 శాతానికి చేరింది. బేసిక్ శాలరీ ప్రాతిపదికన ఉద్యోగుల డీఏ లెక్కిస్తారు.

No comments

Powered by Blogger.