Dates Benefits: వర్షాకాలంలో రోజూ పొద్దున్నే ఓ రెండు ఖర్జూరాలు తింటే.... మీ బాడీలో ఈ 7 మార్పులు గమనిస్తారు ..
ఖర్జూరాలను ఎలా తిన్నా ఆరోగ్య పరంగా వీటి ద్వారా ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అయితే వర్షాకాలంలో వీటిని తినడం వల్ల మరిన్ని అధిక ప్రయోజనాలు అందుతాయి.
దీని గురించి పోషకాహార నిపుణులు కూడా చెబుతున్నారు.
ఖర్జూరాలు తినడం వల్ల శక్తి స్థాయులు పెరుగుతాయి. హిమోగ్లోబిన్ స్థాయులు కూడా పెరుగుతాయి. ఖర్జూరాలు రోజూ తినడం వల్ల నిద్రకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. అలర్జీలు, ఇన్ఫెక్షన్లు వంటి వాటితో పోరాడే శక్తిని ఖర్జూరాలు అందిస్తాయి
ఖర్జూరం వ్యాయామం చేసే శక్తిని పెంచుతుంది. ఎసిడిటీ, మలబద్ధకాన్ని తొలగిస్తుంది. ఖర్జూరాల్లో పీచు పదార్థం, పొటాషియం, ఐరన్ వంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. అందుకే చక్కెర తినాలనిపించినప్పుడు వీటిని తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది
వీటి గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల డయాబెటిస్ ఉన్న వారు కూడా వీటిని తీసుకోవచ్చు. ఇందులోని ఫైటోకెమికల్స్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయి. గుండెపోటు ముప్పును తగ్గిస్తాయి. ఖర్జూరాలను రోజులో ఎప్పుడు తినాలో కూడా పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు
ప్రతి రోజూ ఉదయాన్నే ఖర్జూర పండ్లను తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మీకు రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయులు తక్కువగా ఉంటే.. భోజనం చేసిన తర్వాత కాసేపటికి వీటిని తీసుకోవాలి. పిల్లలైతే బ్రేక్ ఫాస్ట్ కి, లంచ్ కి మధ్యలో తీసుకోవచ్చు.
తీసుకునే ఖర్జూరాలు ఫ్రెష్ గా ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం సూపర్ మార్కెట్లో లభించేవి కాకుండా మార్కెట్లో లభించే ఫ్రెష్ ఖర్జూరాలు కొనుక్కోవాలి. మంచి నాణ్యమైన ఖర్జూరాలను క్రమం తప్పకుండా తీసుకోవాలి
No comments